Covid19 vaccination: వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది. తొలి విడత వ్యాక్సిన్‌లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid vaccination ) మరో 4 రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రారంభం కానుంది. దేశంలోని వివిధ నగరాలకు వ్యాక్సిన్ సరఫరా మొదలైంది. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయవాడకు ప్రత్యేక విమానం ద్వారా సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) ‌కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( Covishield vaccine ) చేరుకుంది.


కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీకి తెలంగాణ ( Telangana ) వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్‌లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను కోవిన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, ఇప్పటికే డ్రైరన్‌ కూడా పూర్తి చేసింది. వ్యాక్సిన్‌ పంపిణీలో వృధాను దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన లబ్ధిదారుల నిష్పత్తికి అదనంగా పది శాతం డోసుల వ్యాక్సిన్‌ను కేటాయించింది. మరోవైపు ఈ వ్యాక్సిన్ న్యూఢిల్లీ, ముంబై చెన్నై, అహ్మదాబాద్ నగరాలకు కూడా వ్యాక్సిన్ చేరుకుంది. అటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయవాడ ఎయిర్‌పోర్ట్ ( Vijayawada airport ) ‌కు సైతం చేరుకుంది. హైదరాబాద్ నుంచి తెలంగాణలోని ఇతర జిల్లాలకు, విజయవాడ నుంచి ఏపీలోని మిగిలిన జిల్లాలకు వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. 


Also read: Telangana Coronavirus: రాష్ట్రంలో 4,524 కరోనా యాక్టివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook