Narrow escape for Etela Rajender and all other Telangana BJP leaders as flight mishap averted: న్యూ ఢిల్లీ: ఈటల రాజేందర్ సహా తెలంగాణకు చెందిన కీలక బీజేపి నేతలు తృటిలో పెను ప్రమాదం బారి నుంచి బయటపడ్డారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా ఢిల్లీ వెళ్లి వస్తున్న బీజేపి నేతల బృందం ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో విమానంలో ఓ సాంకేతిక లోపం తలెత్తగా.. పైలట్ వెంటనే అప్రమత్తమవడంతో ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : L Ramana: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన TTDP చీఫ్ ఎల్ రమణ


ఆ సమయంలో విమానంలో ఈటల రాజేందర్‌తో (Etela Rajender) పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమతో పాటు మొత్తం 184 మంది ఉన్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Also read : TS inter second year exams: ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దుపై ఉత్తర్వులు, Results పైనే కసరత్తు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook