KA Paul Comments On AARAA Survey: ఆరా సర్వేను తప్పుపడుతూ కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రజా శాంతి పార్టీకే 60 % ఓటు బ్యాంక్ ఉందన్న కేఏ పాల్.. ఎన్నికల సర్వే పేరుతో తప్పుడు ప్రచారం చేస్తోన్న ఆరా సంస్థ యజమాని మస్తాన్ రావుపై తెలంగాణ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి 36 శాతం, బీజేపికి 30 శాతం ఓట్లు వస్తాయని తప్పుడు నివేదికలు వైరల్ చేసి జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని.. కానీ వారి ఆటలు సాగవని కెఎ పాల్ హితవు పలికారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరా సర్వే పేర్కొన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితికి 36 శాతం, భారతీయ జనతా పార్టీకి 30 శాతం ఓట్లు పోల్ అవుతాయనడంలో నిజం లేదన్న కేఏ పాల్.. రాష్ట్రంలో ప్రజా శాంతి పార్టీకి మంచి ఆదరణ ఉందని, 60 శాతం ఓటు బ్యాంక్ తమకే ఉందని స్పష్టంచేశారు.  మస్తాన్ రావుపై ఆగ్రహం వ్యక్తంచేసిన కేఏే పాల్.. ఆరా సర్వే రిపోర్టును ( AARAA Survey Report ) చించేసి తన నిరసన వ్యక్తంచేశారు.


Also Read : Ktr Comments: కాంగ్రెస్, బీజేపీ సర్వేల్లో టీఆర్ఎస్ దే అధికారం! 90 సీట్ల లెక్క చెప్పిన కేటీఆర్..


Also Read : Revanth Reddy on CM Kcr: ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని రా..చూసుకుందాం..కేసీఆర్‌కు రేవంత్‌ సవాల్..!


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook