హైదరాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పునఃప్రారంభం జూన్ 1వ తేదీన ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదని ఓ అధికారి పేర్కొన్నారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో పరిస్థితులను బట్టి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం పాఠశాలల పున:ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశముందని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:పాకిస్తాన్ కుయుక్తి..!!


రాష్ట్రంలో ఈ నెల 7వ తేదీ వరకు ప్రభుత్వం ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించగా, దేశవ్యాప్తంగా ఈ నెల 17 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సుమారుగా మే నెల మొత్తం లాక్‌డౌన్ కొనసాగే పరిస్థితులే కనిపిస్తున్నాయని, జూన్‌ మాసంలో కొద్ది వరకు సడలింపులతో ఆ ప్రభావం ఉండవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జూన్ 1న వేసవి సెలవులు ముగిసి, తిరిగి బడులు ప్రారంభం కావడం కష్టమేనని అధికారులు పేర్కొంటున్నారు. మొదటి తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులను ప్రమోట్ చేసినట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. 


 ఈ నెలలో పరిస్థితులు అదుపులోకి వస్తే మిగిలిపోయిన పదవ తరగతి పరీక్షలను నిర్వహించే అవకాశముంటుందని, లేదంటే జూన్ నెలలోనే నిర్వహించాల్సి వస్తుందని విద్యా శాఖ అధికారులు తెలిపారు. మొత్తానికి కొత్త విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..