Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం (జనవరి 16న) రాత్రి 8గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (2) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల (positive cases) సంఖ్య 2,91,666 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,577 కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. నిన్న కరోనా (Coronavirus) నుంచి నిన్న 379 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 2,85,898 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 4,191 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Covid-19) రికవరీ రేటు 98.02 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతం ఉంది. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?


నిన్న (Telangana) రాష్ట్రంలో 33,298 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి జనవరి 16వ తేదీ వరకు మొత్తం 74,61,687 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో 57 కేసులు నమోదయ్యాయి.


Also Read: COVID-19 vaccination: తొలి రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook