తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం యథాతథంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్నా పాజిటివ్ కేసులు, మరణాలు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 6,361 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,69,722కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా(CoronaVirus) బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 77,435 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 6 వేల 3 వందల 61 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కోవిడ్19 పాజిటివ్ కేసుల సంఖ్య(Telangana Corona Cases) 4 లక్షల 69 వేల 7 వందల 2కు చేరింది. కరోనాతో పోరాడుతూ రాష్ట్రంలో మరో 51 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,527కి చేరింది. 


Also Read: COVID-19 Vaccination: మీకు దగ్గర్లోని కోవిడ్ టీకా కేంద్రాన్ని WhatsAppలో తెలుసుకోండి


తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో GHMC పరిధిలోనే 1,225 కోవిడ్19 కేసులు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో ప్రస్తుతం 77 వేల 704 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.32 కోట్ల శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు నేటి ఉదయం హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. తెలంగాణలో చికిత్స అనంతరం నిన్న ఒక్కరోజు కోవిడ్-19 బారి నుంచి 8,126 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,89,491 మంది కరోనా మహమ్మారిని జయించారు. రాష్ట్రంలో కరోనా (CoronaVirus) బారి నుంచి కోలుకుంటున్న వారు 82.91 శాతం ఉన్నారు. జాతీయ సగటు 82 శాతంగా ఉంది.


Also Read: CT Scan For COVID Patients: సీటీ స్కాన్ వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ ముప్పు, AIIMS డైరెక్టర్ సంచలన విషయాలు


తెలంగాణలో ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాల ప్రక్రియ కొనసాగుతోంది. యువతీయువకులకు ఇచ్చేందుకు టీకాలు లేని పరిస్థితి పలు జిల్లాల్లో కనిపిస్తోంది. కానీ కరోనా టీకాల వివరాలు తెలుసుకునేందుకు టీకా కేంద్రాలకు యువతీయువకులు తరలి వస్తున్నారు. సీఎం కేసీఆర్ అదనంగా ఆరోగ్యశాఖ తీసుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టులు తగ్గించడంతో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కోవిడ్19 నిబంధనలు పాటించడం, కరోనా టీకాలు తీసుకోవడం మాత్రమే మహమ్మారిని ఎదుర్కొనేందుకు మార్గాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Also Read: Risk Factors For Covid-19: కరోనా వీరికి సోకితే మరింత ప్రమాదకరం.. ప్రాణాలు కూడా పోతాయి 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook