హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు (Road Accident AT ORR)పై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శంషాబాద్ నుంచి గచ్చిబౌలికి నార్సింగ్ ఫ్లైఓవర్ కింద ఈ ఘటన జరిగింది. అతివేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు ఇద్దరు మృతి చెందారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మద్యం సేవించి ఉన్నారని, కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe