China Apps Banned : టిక్ టాక్ ( TikTok) , షేర్ ఇట్ ( Share It ) లాంటి 59 చైనా యాప్స్ ను భారత దేశం బ్యాన్ చేయడాన్ని అమెరికా స్వాగతించింది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ( Mike Pompeo ) ఒక ప్రకటన చేశారు. Also Read : https://zeenews.india.com/telugu/india/mukul-rohatgi-refuses-to-represent-tiktok-22848


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గాల్వాన్ లోయలో  ( Galwan Valley ) జరిగిన ఘర్షణలో భారతీయ జవాన్లు అమరులయ్యారు. ఆ తరువాత ఇదరు దేశాల మధ్య ఉద్రిక్త ( India China China Conflict 2020 )  పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో  భారతీయుల్లో చైనా పట్ల పెరిగిన ధ్వేషం, జాతీయ సమగ్రత ( National Integrity )  , భద్రతను ( National Security ) దృష్ట్యా ప్రభుత్వం 59 చైనా యాప్స్ ను ఇటీవలే బ్యాన్ చేసింది. భారత దేశం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సమర్థించారు. భారత ప్రభుత్వం తమ ప్రజల సంక్షేమం కోసం, వ్యక్తిగత సమాచార గోప్యత ( Data Privacy ) కోసం తీసుకున్న ఈ నిర్ణయం క్లీన్ ఆప్ అప్రోచ్‌లో ముందడు అని ప్రశంసించాడు పాంపియో.


చైనాకు చెందిన టిక్ టాక్, షేర్ ఇంట్, యూసీ బ్రౌజర్, విమేట్,  లైక్, హెలో వంటి మొత్తం 59 యాప్స్ ను భారత్ ఇటీవలే బ్యాన్ చేసింది. దాంతో వెంటనే ఈ నిషేధం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ యాప్స్ భారత దేశ వినియోగదాలుకు అందుబాటులో లేవు.  వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి అంటూ ప్రభుత్వం ఇప్పటికే సర్వీస్ ప్రొవడైకర్లకు ( Service Provider )  సూచనలు జారీ చేసింది. జాతి భద్రతకు విఘాతం కలిగించే యాప్స్ ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 (IT Act 2020 ) లోని 69 ఏ  ప్రకారం వీటిని బ్యాన్ చేసింది.  Also Read : SBI Home Loan : ఎస్‌బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లలో కీలక మార్పులు