ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయితీ ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap Local Body Elections ) వివాదం కోర్టుల చుట్టూ తిరుగుతోంది. స్థానిక సంస్థల్ని నిర్వహించాలని హైకోర్టు  ( High Court ) ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) లో పిటీషన్ వేసింది. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ ఉత్తర్వుల్ని హైకోర్టు సింగిల్ బెంచ్ నిలిపివేసింది. దాంతో ఎన్నికల కమీషన్ ఈ నిర్ణయాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు..ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది.


హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా మరోసారి ఏపీ ప్రభుత్వం  ( Ap Government ) సవాలు చేసింది. సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం వివరించింది. 


Also read: AP: త్వరలో విశాఖ నుంచి వైఎస్ జగన్ పరిపాలన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook