అమరావతి: జూనియర్ ఎన్టీఆర్(Jr Ntr) పేరు మరోసారి ఏపీ రాజకీయాల్లో తెరపైకొస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi) టీడీపీకి గుడ్ బై చెప్పిన సందర్భంగా మొన్న మీడియాతో మాట్లాడుతూ.. '' పదేళ్ల క్రితం టీడీపీ విజయం కోసం కృషిచేసిన ఎన్టీఆర్‌ను ఎందుకు పక్కకు పెట్టారు'' అని నిలదీసిన సంగతి తెలిసిందే. వల్లభనేని వంశీ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇరుకున పడిన టీడీపీ ఇంకా కోలుకోకముందే తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) కూడా జూనియర్ ఎన్టీఆర్‌కే జై కొడుతూ.. ఆయన పేరుని ప్రస్తావించారు. టీడీపీలో ఎదిగి టీడీపీనే విమర్శిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు చేసిన విమర్శలకు ఏపీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇస్తూ.. తనకు రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ కాదని.. జూనియర్ ఎన్టీఆర్ అని మరోసారి స్పష్టంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : లేదంటే.. తెలంగాణలోలాగే ఇక్కడ కూడా టీడీపీ మిగలదు: చంద్రబాబుకు వల్లభనేని వంశీ హెచ్చరిక


ఇదివరకే పలు వేదికలపై ఈ విషయాన్ని అంగీకరించిన మంత్రి కొడాలి నాని.. జూనియర్ ఎన్టీఆర్ వల్లే తనకు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం వచ్చిందని తాజాగా మరోసారి తేల్చిచెప్పారు. తనకే కాదు వల్లభనేని వంశీకి కూడా రాజకీయ భిక్ష పెట్టింది జూ.ఎన్టీఆరేనని చెప్పిన కొడాలి నాని.. తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే.. అందుకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబమే కారణం అని అన్నారు. నారా లోకేష్ పప్పులా మాట్లాడుతున్నారని.. ఆయన వల్లే పార్టీ ఎదగడం లేదని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.