Cyclone at Bay of Bengal: బంగాళాఖాతంలో మరో తుపాను హెచ్చరిక జారీ అయింది. కోస్తాంధ్ర తీరానికి తుపాను ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ సూచిస్తోంది. తుపాను తీవ్రత ఎలా ఉంటుందనేది దసరా నాటికి స్పష్టత రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోస్తాంధ్ర తీరానికి తుపాను హెచ్చరిక జారీ అయింది. దసరా నాటికి తుపానుగా మారి కోస్తాంధ్రలో(Coastal AP) తీరం దాటే అవకాశాలున్నాయి. అక్టోబర్ 10 వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ ఇప్పటికే సూచించింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశాగ దక్షిణ ఒడిశా-ఉత్తరాంద్రవైపుకు పయనిస్తూ ఈ నెల 12వ తేదీన వాయుగుండంగా మారనుంది. ఆ తరువాత మరింతగా బలపడి..ఈనెల 13, 14 తేదీల్లో తుపానుగా మారే అవకాశముందని అంచనా. తుపానుగా(Cyclone)మారిన తరువాత తీవ్రత ఎలా ఉంటుందనేది రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. తుపానుగా మారిన తరువాత మచిలీపట్నం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఈ నెల 15 నాటికి తీరం దాటే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సాధారణంగా అక్టోబర్ నెలంటే తుపానుల సీజన్. ఈ నెల 10వ తేదీన ఉత్తర అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరంవైపుకు పయనించనుంది. ఈ నెల 10 వ ఏర్పడే అల్పపీడనం తుపానుగా మారే పరిస్థితులు పూర్తిగా ఉన్నాయని ఐఎండీ(IMD) తెలిపింది. తుపాను తీవ్రత ఎలా ఉన్నా సరే..ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు(Heavy Rains)పడనున్నాయి.


Also read: US Nuclear Submarine: యూఎస్ అణు జలాంతర్గామికి ప్రమాదం, చైనా ఆందోళన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook