AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం మొహం చాటేస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్ని ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఇంకా ఖరారు కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Ap government) పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనికి సంబంధించి ఈ నెల 20వ తేదీన అసెంబ్లీతో పాటు శాసన మండలి సమావేశం కానుంది. ఈ నెల 20న ఉదయం 9 గంటలకు రెండు చోట్ల సమావేశం ప్రారంభమవుతుంది. కోవిడ్ నేపధ్యంలో బడ్జెట్ సమావేశాల్ని(Budget Session) ఒక్కరోజుకే పరిమితం చేయాలా లేదా కొన్నిరోజులు నిర్వహించాలా అనే విషయంపై శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.


ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు (Assemby Sessions) ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు(Chandrababu) మొహం చాటేయనున్నారని తెలుస్తోంది. ఏపీ బడ్దెట్ సమావేశాలకు హాజరుకాకూడదని టీడీఎల్పీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది. కరోనా నేపధ్యంలో హైదరాబాద్‌కే పరిమితం కావాలనే యోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్టు సమాచారం. అసెంబ్లీ వేదికగా టీడీపీ అవినీతి, అన్యాయాలు, రఘురామకృష్ణంరాజు వ్యవహారం, ఎన్ 440 కే వైరస్ ప్రచారంపై తెలుగుదేశం ఇరుకునపడే పరిస్థితి కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


Also read: YSR Matsyakara Bharosa: మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా రూ.10 వేలు జమ చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook