Gold Price Today 15Th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) స్వల్పంగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి దిగొచ్చింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,190 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.46,010కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


దేశ రాజధాని ఢిల్లీ (Delhi) మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) మరోసారి స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర (Gold Price Today) రూ.230 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.52,310కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,950కి పతనమైంది. 


Also Read: Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం ప్రభావం! 



బులియన్ మార్కెట్‌లో డిసెంబర్ నెలలో వెండి ధరలు తగ్గుతున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) రూ.400 మేర దిగొచ్చింది. దీంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.63,200కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.4,200 మేర పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.63,200కి పతనమైంది.  


Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook