Gold Price Today 17th December 2020: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రూ.50 వేల మార్క్ చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర మరోసారి భారీగా పెరిగి రూ.70 వేల మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 మేర పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.50,400 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 400 మేర పెరిగింది. తద్వారా 10 గ్రాముల ధర రూ.46,200కి ఎగసింది. 


Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!



దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధరలు (Gold Price in Delhi) మరోసారి పెరిగాయి. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.440 మేర పుంజుకుంది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.52,750కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,350 అయింది.


Also Read: Postal Life Insurance Benefits: పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తే కలిగే ప్రయోజనాలివే 



డిసెంబర్‌లో బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు చాలా మేర తగ్గుతూ వచ్చాయి. అయితే తాజాగా ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా రూ.1,450 మేర పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.65,600కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,000 మేర పెరిగింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.68,900కి చేరింది.  


Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook