Jr NTR: కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో సందర్భంలో సోకుతోంది. వరుసగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటిలు కరోనా బారిన పడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి (Corona Virus) శరవేంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న కరోనా వైరస్ వేరియంట్‌కు అత్యంత వేగంగా సంక్రమించే లక్షణముంది. అందుకే ప్రతి ఒక్కరినీ తాకుతోంది. గత కొద్దికాలంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే అల్లు అర్జున్ హోం ఐసోలేషన్‌( Home Isolation) లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఎవరూ కంగారు పడవల్సిన అవసరం లేదని..ప్రస్తుతం బాగానే ఉన్నానని తారక్ స్పష్టం చేశారు. తనతో పాటు కుటుంబసభ్యులంతా హోం ఐసోలేషన్‌ ( Home Isolation)లో ఉన్నామని చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ కోవిడ్ నిబంధనల్ని పాటిస్తున్నట్టు తెలిపారు. గత కొద్దిరోజులుగా తనను కాంటాక్ట్ అయినవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ సూచించారు. 


Also read: TNR Passes Away: COVID-19తో నటుడు, ప్రముఖ జర్నలిస్ట్ TNR కన్నుమూత


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook