ఉప్పెన ( Uppena ) సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తార కృతి శెట్టి ( Krithi Shetty ). ఆ సినిమా విడుదల కాకముందే నీ కళ్లు నీలి సముద్రం పాటతో తెలుగు కుర్రకారు గుండెజారి గల్లంతు అయ్యేలా చేసింది ఈ చిన్నది. మంచి ఫ్యాన్ బేస్ సంపాదించింది. దాంతో ఆమెతో సినిమాలు చేయడానికి పెద్ద పెద్ద దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ|  Sri Krishna : ఈ  గ్రామంలో పాలు అమ్మరు  పంచుతారు..ఎందుకంటే..


మరోవైపు ఈ హీరోయిన్ ఒక క్రేజీ ప్రాజెక్టు చేయనుంది అని వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శ్యామ్ సింగ రాయ్ ( Shyam Singha Roy ) చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది అని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో నానీ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి ( Sai Pallavi ) కథానాయికగా నటిస్తోండగా కృతి శెట్టి కీలక పాత్రలో కనిపించనుందట.


సితారా ఎంటర్మైంట్ కృతి శెట్టి రెండు సినిమాలు చేయడానికి అంగీకరించినట్టు సమాచారం.


ఉప్పెన సినిమా విడుదల కాకముందే నానీ ( Nani ) వంటి స్టార్ హీరోతో తెలుగు సినిమా ఛాన్స్ రావడం అనేది మంచి విషయం అంటున్నారు సినీ క్రిటిక్స్.  తెలుగు సినీమాకు మరో ఫ్యూచర్ హీరోయిన్ దొరుకుతుంది అని వారు వారంటున్నారు.



ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?