కరోనావైరస్ ( Coronavirus ) వల్ల ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయడంలో సోసూసూద్ ఎప్పుడూ ముందుంటాడు. వలస కూలీలను వారి గమ్యస్థానానికి చేర్చడం కానివ్వండి, విదేశాల నుంచి భారతీయులను రప్పించడం ఇలా కలియుగ కర్ణుడు సోనూ సూద్ చేసిన సహాయాలు అన్ని ఇన్నీకాదు.



తాజాగా జేఈఈ, నీట్ పరీక్షలు జరిగితే టెస్ట్ సెంటర్ కు ఎలా వెళ్లాలి అని టెన్షన్ పడుతున్నవారికి నేనున్నాను అని అభయహస్తం అందించాడు సోనూసూద్ ( Sonu Sood ).



ఒక వేళ జేఈఈ, నీట్ పరిక్షలు జరిగితే.. మీరు ఖంగారు పడకండి. మీరు ఎక్కడికైనా వెళ్లాలి అనుకుని మధ్యలో ఇరుక్కోపోతే.. నన్ను సంప్రదించండి. నేను మీకు సహాయం చేస్తాను. సహాయం లేకపోవడం వల్ల ఎవరూ పరీక్షలు మిస్ అవ్వకూడదు అని ట్వీట్ చేశాడు.