హైదరాబాద్: మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకొంటున్న ఓ భారీ స్థాయి సినిమా తెరకెక్కనున్నాయన్న ఊహాగానాలకు ముగింపు పలికింది. వైజయంతీ మూవీస్‌ భారీ బడ్జెట్ తో ఈ మూవీని ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ మూవీ ప్రకటించినప్పటి నుండి ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ప్రతి నాయికగా ఎవరన్నది పెద్ద చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.. అంతే కాకుండా ఎవరు నటిస్తున్నారోనని సినీ ఫక్కీలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే..


మరోవైపు తాజాగా ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఎంపిక చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ అలియా భట్ ను నాగ్ అశ్విన్ ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ సరసన మరోసారి బాలీవుడ్ భామ నటించనుండడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. కాగా, ఇప్పటికే అలియా భట్ 'ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..