Air India Free Tickets: అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియాను టాటా గ్రూప్​ బిడ్డింగ్​లో దక్కించుకున్న (Tata group owns Air India) తర్వాత.. కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ​ఇండియాను టాటా సంస్థకు అప్పగించేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ కసరత్తులో భాగంగా అన్ని బకాయిలను ముందుగానే క్లియర్​ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అందరూ ఎయిర్​ఇండియా విమాన టికెట్లను డబ్బు చెల్లించి కొనాలని కూడా స్పష్టం చేసింది.


ఎంపీలకు ఉచిత టికెట్లు బంద్​​..


పార్లమెంట్ సభ్యులకు(ఎంపీ) ఇప్పటికే ఉచిత ఎయిర్​ఇండియా విమాన టికెట్లు నిలిచిపోయాయి. ప్రభుత్వ సంస్థగా ఎయిర్​ఇండియా ఉన్నన్నాళ్లు ఎంపీలకు ఉచితంగా టికెట్​ ప్రొటోకాల్ అమలయ్యేది. ఇప్పుడు ప్రైవేటు సంస్థగా (Air India privatization) ఎయిర్​ఇండియా సేవలందించనున్న నేపథ్యంలో ఎంపీలు విమాన టికెట్లను ఉచితంగా పొందలేరని.. డబ్బులు పెట్టి కొనాలని రాజ్యసభ సచివాలయం శుక్రవారం బులిటెన్​లో పేర్కొంది.


ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ఉచిత టికెట్ (Free Air India Flight ticket) సదుపాయం కూడా రద్దు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


Also read: Drone traffic: డ్రోన్ల ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు కొత్త ప్రణాళిక


Also read: ''spying for Pakistan'': పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ అరెస్ట్‌


గతంలో ఇలా..


ఇంతకు ముందు ఎంపీలకు వ్యక్తిగతంగా 34 విమాన టికెట్లు, వారి జీవిత భాగస్వామికి 8 టికెట్లు ఉచితంగా జారీ చేసేవారు. ఇందుకోసం పార్లమెంట్​ ఉభయ సభల సచివాలయాలు.. 'ఎక్స్ఛేంజ్​ ఆర్డర్​'ను జారీ చేసేవి. ఊ ఆర్డన్​ను చూయించి ఉచితంగా ఎయిర్​ ఇండియా విమనాల్లో ప్రయాణించేందుకు వీలుండేది. అయితే తాజాగా ఆ విధానాన్ని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.


Also read: Third Wave: ఇండియాలో 17 కొత్త వేరియంట్ల కరోనా కేసులు.. థర్డ్ వేవ్ రానుందా..??


Also read: Karnataka school: పాఠశాలలో కరోనా కలకలం..32 మంది విద్యార్థులకు పాజిటివ్!


రియంబర్స్​మెంట్ సదుపాయం ఉనా..


అయితే ఎంపీలు డబ్బు పెట్టి టికెట్​ కొనుగోలు చేసినప్పటికీ.. తదుపరి దశలో రియంబర్స్ చేయనుంది ప్రభుత్వం. అయితే ప్రయాణానికి ముందు మాత్రం డబ్బు చెల్లించి టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ విధానం ఇబ్బందులు కలిగించే అంశమని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక స్తోమత లేని ఎంపీలు ప్రతి సారి ఇలా డబ్బు పెట్టి విమాన టికెట్ కొనడం ఇబ్బందులతో కూడిన అంశమని చెబుతున్నారు. రియంబర్స్​ సదుపాయం ఉన్నప్పటికీ.. బిల్లుల క్రియరెన్స్​కు సమయం పడుతుందని అంటున్నారు.


Also read: Amit Shah: కేందంలో మోదీ-యూపీలో యోగీ నినాదంతో అమిత్ షా


Also read: West Bengal: పశ్చిమ బెంగాల్ లో పాన్‌ మసాలా, గుట్కాపై నిషేధం..నవంబరు 7 నుంచి అమల్లోకి..!