India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం విస్తరిస్తూనే ఉంది. రెండురోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొన్నిరోజులుగా నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే కేసులు మరణాల సంఖ్య భారీగా తగ్గింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. దేశంలో కరోనా కేసులకన్నా.. రికవరీ రేటు భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో బుధవారం ( అక్టోబరు 21న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 55,838 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 702 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,06,946 కి పెరగగా... మరణాల సంఖ్య 1,16,616 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 



అయితే.. దేశవ్యాప్తంగా బుధవారం కరోనాతో 79,415 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి 68,74,518 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో  7,15,812  కరోనా కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా రిక‌వ‌రీ రేటు 89.20 శాతం ఉండగా.. మ‌ర‌ణాల రేటు 1.51 శాతం, యాక్టివ్ కేసుల రేటు 9.29 శాతం ఉన్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. 



ఇదిలాఉంటే.. బుధవారం దేశవ్యాప్తంగా 14,69,984 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి అక్టోబరు 21 వరకు మొత్తం 9,86,70,363 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe