బంగారం ప్రేమికులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు తగ్గాయి. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది. ధరలు తగ్గడంతో నేడు బంగారు, వెండి కొనుగోళ్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మార్చి 17న భారీగా పెరిగిన బంగారం ధరలు


EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 


అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. అయితే హైదరాబాద్ మార్కెట్‌లో మాత్రం మార్చి 16న (సోమవారం) బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల ధర రూ.930 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.42,920కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగానే రూ.860 తగ్గడంతో నలభై వేలకు కిందకి దిగొచ్చింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.39,350కి క్షీణించింది. 


Also Read: నేటి నుంచి ఆ కార్డులపై సర్వీసులు రద్దు


దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.850 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.41,400 అయింది. కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,200కు పడిపోయింది.


See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు


కాగా, బంగారం ధరలు తగ్గగా.. వెండిసైతం పసిడి దారిలోనే పయనించింది. సోమవారం మార్కెట్‌లో వెండి ధర 1 కేజీకి రూ.230 దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.47,800కు చేరుకుంది. హైదరాబాద్‌లోనూ వెండి ధర రూ.47,800కి క్షీణించింది. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..