తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1481 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In Telangana) నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపితే తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,34,152కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



 


తెలంగాణలో మృతుల సంఖ్య 1,319కి చేరింది. చికిత్స అనంతరం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న బాధితుల సంఖ్య  2,14,917గా ఉంది. ప్రస్తుతం 17,916 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 14,883 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 40,081 శాంపిల్స్‌కు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 



 


కాగా, భారత్‌లో కరోనా మరణాల రేటు 1.5 శాతం ఉండగా, తెలంగాణలో మాత్రం 0.56శాతం ఉండటం గమనార్హం.  రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం 41,55, 597 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe