Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. గత కొన్నిరోజుల క్రితం 2వేలకు పైగా నమోదైన కేసులు.. నాలుగు రోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్నాయి. దీంతోపాటు రికవరీ రేటు కూడా రాష్ట్రంలో గణనీయంగా భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో మంగళవారం ( అక్టోబరు 20 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,26,124 కి చేరగా.. మరణాల సంఖ్య 1,287 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Hyderabad Rains: బ్రహ్మాజీకి నెటిజన్ల షాక్.. ట్విట్టర్ నుంచి తప్పుకున్న నటుడు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,811 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,04,388 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 20,449 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 90.38 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది. Also read: Pawan Kalyan Donation: వరద బాధితులకు పవన్ కల్యాణ్ భారీ విరాళం.. జనసైనికులకు పిలుపు


మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా 41,475 కరోనా పరీక్షలు చేశారు. దీంతో ఇప్పటివరకు 39,40,304 టెస్టులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 256 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 135, ఖమ్మం జిల్లాలో 106, రంగారెడ్డి జిల్లాలో 102 కేసులు నమోదు అయ్యాయి. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G