తెలంగాణ డీఈఈ సెట్ పరీక్ష (TS DEECET) రాసేందుకు వెళ్తున్న ఇద్దరు అభ్యర్థులు రోడ్డు ప్రమాదం (Road Accident In Hyderabad)లో మృతి చెందారు. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్‌ (Hyderabad)లోని మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read:  COVID19 నెగెటివ్ వచ్చిన మరుసటి రోజే మంత్రి మృతి!


 


ఇంటర్ విద్యార్హతతోనే ఉద్యోగానికి అర్హత కల్పించే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (TS DEECET) పరీక్ష నేడు. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్ అనే అభ్యర్థులు డైట్‌సెట్ పరీక్ష రాసేందుకు బైకుపై హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో పరీక్షా కేంద్రానికి వెళ్లుండగా మదీనాగూడలోని సౌత్ ఇండియా షాపింగ్ కేంద్రం వద్దకు రాగనే  వేగంగా దూసుకొచ్చిన లారీ వీరి బైకును ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  


Also Read : CoronaVirus: కళ్లద్దాలు ధరిస్తే ఎంత వరకు ప్రయోజనం ఉందంటే! 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe