ప్రపంచ దేశాలను ప్రస్తుతం పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ (CoronaVirus). ప్రాణాంతక కోవిడ్19 (COVID-19) బారినపడి ప్రపంచ వ్యాప్తంగా 7వేలకు పైగా మరణాలు సంభవించాయి. భారత్‌లోనే కరోనా పాజిటీవ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతున్నారో చెబుతున్నారు. మేము సైతం అంటూ టాలీవుడ్ బిగ్ స్టార్స్(RRR) యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అడుగు ముందుకేశారు. కరోనా గురించి అవగాహన కల్పిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు



కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆ వీడియో ద్వారా తెలిపారు. కరోనా గురించి ఆందోళన అక్కర్లేదని తరచుగా (రోజుకు కనీసం 8 పర్యాయాలు) చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. తుమ్మినప్పుడు అరచేతులను అడ్డుగా పెట్టుకోవద్దని మోచేతిని వాడాలని చెప్పారు. వాట్సాప్‌లో వచ్చే వదంతులను నమ్మవద్దని, పరిశుభ్రతతోనే కరోనాను జయించవచ్చునని పలు వివరాలు షేర్ చేసుకున్నారు. 


EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..  


దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లతో ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉన్నారు. అయితే కరోనా వైరస్ పై నిత్యం వదంతులు వ్యాపిస్తుండటంతో దాని గురించి అవగాహన కల్పించేందుకు చెర్రీ, తారక్ ఈ వీడియో తీశారు. ఆర్ఆర్ఆర్ అధికారిక ట్విట్టర్ వేదికగా వీడియో షేర్ చేశారు. RRRలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ సైతం ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ అలియా భట్, ఓ హాలీవుడ్ నటిని ఈ సినిమాకు తీసుకున్నారు. 


Photos: అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ 
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..