గత వారం రోజులుగా ముంచెత్తుతున్న వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్ట పోయిన హైదరాబాద్ (Hyderabad Floods) ప్రజలకు అండగా ఉండేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు మేముసైతం అంటూ కదులుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలక్రిష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్స్‌తో పాటు టాలీవుడ్ డైరెక్టర్స్ తమ వంతుగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌ (Telangana CM Relief Fund)కు విరాళాలు ప్రకటించారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈ నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)‌ మంగళవారం రాత్రి కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలో విరాళం నగదు అందించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా ప్రపంచం ఎంతో కుదేలైపోయిందని, తాజాగా భారీ వర్షాలు తెలంగాణ ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తనవంతుగా వరద బాధితులకు రూ.కోటి రూపాయల సాయం (Pawan Kalyan donates Rs 1 crore to Telangana CM Relief Fund) ప్రకటించారు.



 



 



జనసైనికులు సైతం తమ వంతు సాయం ప్రకటించాలని సూచించారు. వీలైనంత వరకు సహాయ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.   


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe