కేరళలోని కోయికోడ్ ( Kozhikode ) లో జరిగిన ఎయిర్ ఇండియా ( Air India ) విమానం పై ప్రధాని మోదీ ( PM Modi ) ట్వీట్ చేశారు. ఈ ప్రమాదం తనను కలచివేసింది అని , మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని.. గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని కోరారు. అదే సమయంలో కేరళ ముఖ్యమంత్రి ( Kerala CM VijayPinarayi ) విజయ పినరయితో మాట్లాడినట్టు ట్వీట్ లో తెలిపారు మోదీ.




దుబాయ్ నుంచి కోయికోడ్ ( AI Flight Dubai To Kozhikode ) వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ రన్ వేపై స్కిడ్ అయింది. దీంతో విమానం రెండు ముక్కలు అయింది. ఈ ప్రమాదంలో విమానం ముందు బాగం పూర్తిగా నలిగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు.  కాగా ఇందులో పైలెట్ తో సహా 14 మరణించినట్టు సమాచారం.




Note: Read About Coronavirus Top Tips and Covid-19 Prevention Here: 


ముఖ్య గమనిక: కరోనావైరస్ నివారణ, కోవిడ్-19 నివారణ చిట్కాల కోసం దిగువ ఆర్టికల్స్ చదవగలరు.