తెలంగాణలో కరోనా వైరస్ (CoronaVirus)  మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 2,214 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Positive Cases In Telangana) నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,93,600కి పెరిగింది. అదే సమయంలో నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది కరోనాతో మరణించారు. తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,135కి చేరింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న ఒక్కరోజే 54,443 కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,214 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుతల చేసింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 305 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారించారు. తెలంగాణలో ఇప్పటివరకూ కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,63,407కు పెరిగింది. నిన్న బుధవారం ఒక్కరోజే 2,474 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులుండగా.. అందులో 23,702 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు.



 


ఆసక్తికర కథనాలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe