Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కోవిడ్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో నిన్న కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో ( డిసెంబరు 27న ) ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 205 కరోనా కేసులే నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా ఇద్దరు (2) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,85,068 కి చేరగా.. మరణాల సంఖ్య 1,533 కి పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కేసులతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 551 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,77,304 మంది బాధితులు కోలుకున్నట్లు (Telangana) వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 6,231 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. Also Read: Double Bedroom అమ్మితే కేసు నమోదు చేస్తాం: హరీశ్‌రావు


ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా (Coronavirus) రికవరీ రేటు 97.27 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. తెలంగాణ (Telangana) వ్యాప్తంగా నిన్న 27,244 కరోనా టెస్టులు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 27వ తేదీ వరకు మొత్తం 67,50,954 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. హైదరాబాద్ (GHMC) పరిధిలో 54 కేసులు నమోదయ్యాయి. Also Read: Covid-19: ఇదే చివరి మహమ్మారి కాదు: WHO


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook