Heavy Rains Alert: ఉత్తరాది భారీ వర్షాలకు ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు అన్నీ ధ్వంసం

Heavy Rains Alert: భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ సహా పంజాబ్, రాజస్తాన్, జమ్ము కశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి మరింత ఘోరంగా మారింది.

Heavy Rains Alert: బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది. నదీ ప్రవాహంతో కొట్టుకొచ్చే కొలప, దుంగలతో అడ్డొచ్చిన ఇళ్లను ధ్వంసం చేస్తోంది. వరద ఉధృతిలో మార్కెట్లు, వంతెనలు , ఇళ్లు కొట్టుకుపోతున్నాయి.

1 /5

మండి జిల్లాలో ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ధాటికి తునాగ్ ప్రాంతంలోని ప్రధాన మార్కెట్ ఏ విధంగా నాశనమైందో మరో వీడియోలో గమనించవచ్చు. కొండ ప్రాంతాల్నించి కొట్టుకువచ్చే వరదతో పాటు కలప కూడా కొట్టుకొస్తూ అడ్డొచ్చిన చిన్న చిన్న ఇళ్లను ధ్వంసం చేసుకుంటూ పోతున్న బీభత్స దృశ్యాలు

2 /5

కులూ మనాలీ మార్గంలో రోడ్లపై కొండచరియలు, పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడటంతో పరిస్థితి భయానకంగా మారింది. బియాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది. 

3 /5

ఢిల్లీలో అయితే గత 41 ఏళ్లలో లేనంత భారీ వర్షం నమోదైంది. భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తుతున్నాయి. రెండ్రోజుల్నించి కురుస్తున్న భారీ వర్షాలతో నగరమంతా జలమయమైంది. ఎంపీల ఇళ్లు కూడా నీట మునిగాయంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. 

4 /5

వాగులు, వంకలు, నదీ నదాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ఆట్ బంజర్‌ను కలిపే వంతెన వరద ధాటికి చూస్తూ చూస్తుండగానే కొట్టుకుపోయింది.

5 /5

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమౌతున్నాయి. యాస్ నది ఉధృతంగా ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతోంది.