ITR: మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్ (ITR) దాఖలు చేయడంతో పాటు, రీఫండ్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు త్వరగా వస్తుందని భావించడం సహజమే. నిజానికి గతంలో కన్నా కూడా ఆదాయపు పన్ను శాఖ త్వరగా రీఫండ్లను ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతోంది. కాబట్టి ITR ఫైల్ చేస్తున్నప్పుడు, మీరు మీ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం తప్పనిసరి.
Gold: పసిడి ప్రియులకు ఇది పండగలాంటి వార్త. ఎందుకంటే బంగారం ధర భారీగా తగ్గుతోంది. మొన్నటివరకు కొండెక్కి కూర్చొన్న ధర ఇప్పుడు నేలచూపు చూస్తుంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే రానున్న కాలంలో బంగారం ధర రూ. 60వేలకు చేరుకునే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. నిజంగా బంగారం ధర రూ. 60వేలకు దిగువన వస్తుందా? తెలుసుకుందాం.
National Pension Sceme: మూడు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను లోక్ సభలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. అందులో నేషనల్ పెన్షన్ స్కీమ్ పథకంలో పలు మార్పులు చేశారు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు మీ కోసం..
Pradhan Mantri MUDRA Yojana: కేంద్రంలోని మోదీ సర్కార్..ఎన్నో సరికొత్త స్కీములను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగానే ఇటీవలి బడ్జెట్లో నిరుద్యోగులు, వ్యాపారస్తులకు తీపికబురు అందించింది. గతంలో ముద్ర రుణాల లిమిట్ ను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందిస్తున్న ఈ రూ. 20లక్షల లోన్ కావాలంటే ఏం చేయాలి?పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి కేంద్రం నుంచి కీలక ప్రకటన వస్తుందా? లేదా చూద్దాం.
Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీరు తక్కువ నిడివిలోనే ఎక్కువ సంపాదన ఆశిస్తున్నట్లయితే మోతిలాల్ ఓస్వాల్ సూచించిన ఐదు స్టాక్స్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు సుమారు 38% వరకు రాబడి లభించే అవకాశం ఉంటుంది. ఈ స్టాక్స్ అన్నీ కూడా ప్రముఖ బ్రోకర్ అనే సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అందించినవే కావడం గమనార్హం.
Electric Cars: గత కొద్దికాలంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుండటమే కాకుండా హై ఎఫిషియెన్సీతో వస్తుండటంతో అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే కంపెనీలు కూడా ఈవీ కార్లు లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది మరో 4 ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ ఎంట్రీ ఇవ్వనున్నాయి.
BSNL Network Near you: మన ఫోన్ హ్యాండ్ సెట్లో రేడియో ట్రాన్స్మీటర్ ఉంటుంది. వీటి ద్వారా సిగ్నల్స్ ఇతర ఫోన్లకు చేరతాయి. ఇవి తక్కువ దూరంలోనే ప్రయాణిస్తాయి. అందుకే మీ దగ్గర్లో బేస్ స్టేషన్ ఉందా? తెలుసుకోవాలి.
Bank Holidays In August List: బ్యాంకులకు వచ్చే నెల అంటే ఆగస్టులో ఎక్కువ రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ విషయం ముందుగా తెలుసుకుంటే బ్యాంకు కార్యకలాపాలు ముందుగానే ముగించుకోండి. ఆగస్టు నెల శ్రావణమాసం రానుంది. అంతేకాదు ఈ మాసంలో పంద్రాగష్టు, రాఖీపౌర్ణమి మరెన్నో పండుగలు రానున్నాయి ఈ సందర్భంగా బ్యాంకులకు ఎక్కువ సెలవుదినాలు రానున్నాయి.
Cheap and Best Recharge plan: ఇటీవలి కాలంలో టెలీకం కంపెనీలు టారిఫ్ భారీగా పెంచేశాయి. ముందుగా రిలయన్స్ జియో ధరలు పెంచగా అదే బాటలో మిగిలిన రెండు కంపెనీలు ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు పయనించాయి. జూలై 3 నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది.
Titan Company:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పలు వర్గాలకు వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా బంగారం అలాగే విలువైన లోహాలపై కస్టమ్స్ తగ్గించడంతో బంగారం ధర భారీగా తగ్గి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జువెలరీ కంపెనీల షేర్ల ధరలు కూడా ఒక్క సారిగా పెరగడం ప్రారంభించాయి. దీంతో నేరుగా లబ్ధి పొందుతున్న కంపెనీలో టాటా గ్రూపుకు చెందిన టైటాన్ కూడా ఒకటని చెప్పవచ్చు టైటాన్ షేరు ధర ఏకంగా తొమ్మిది శాతం వరకు పెరగటం విశేషం. అదే సమయంలో కళ్యాణ్ జువెలరీస్, సెంకో గోల్డ్ లిమిటెడ్ లాంటి కంపెనీల షేర్లు కూడా భారీగా పెరిగాయి.
Gold Price in Andhra Pradesh : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంలో గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూశాయి. ప్రస్తుతం పుత్తడి, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Stock Market Gold: స్టాక్ మార్కెట్లో జువెలరీ స్టాక్స్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటి (మంగళవారం) బడ్జెట్ ప్రకటనతో నిర్మల సీతారామన్.. బంగారం, వెండి ఇతర విలువైన లోహాలపై కస్టమ్స్ సుంకం ఆరు శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా జువెలరీ స్టాక్స్ అన్నీ కూడా లాభాల బాట పడ్డాయి.మీరు కనుక జువెలరీ స్టాక్స్ పైన లుక్ వెయ్యాలనుకుంటే.. ఏ స్టాక్స్ పైన మీరు దృష్టి సారించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
IPO News: కటారియా ఇండస్ట్రీస్ నేడు ఉదయం NSE SME సూచీలో లిస్ట్ అయ్యింది. ఈ రోజు NSE SMEలో కటారియా ఇండస్ట్రీస్ షేర్లు రూ. 182 వద్ద లిస్ట్ అయి ట్రేడింగ్ ప్రారంభించాయి. కంపెనీ ఐపీవో ఇష్యూ ధర రూ. 96 కాగా దాదాపు 90 శాతం ఎక్కువ లాభంతో. కటారియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు లిస్ట్ అవడం విశేషం. అయితే కటారియా ఇండస్ట్రీస్ IPO జూలై 16 నుంచి షేర్లను ఆహ్వానిస్తూ బిడ్డింగ్ కోసం తెరుచుకుంది.
Old vs New Tax System:కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..పన్ను శ్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చూడటానికి కొత్త పన్ను విధానం కాస్త ఊరించే విధంగా ఉన్నప్పటికీ..సేవింగ్స్, హోం లోన్స్, ఎల్ఐసీ వంటి మినహాయింపులు కావాల్సిన వారికి మాత్రం పాత నన్ను విధానమే బెటర్ అంటున్నారు పన్ను నిపుణుదారులు. మంత్రి బడ్జెట్ ప్రసంగంలో కొత్త పన్ను రెజిమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ ను రూ. 50,000 నుంచి రూ. 75,000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
Union Budget 2024 Updates: నరేంద్ర మోదీ మూడో దపా ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ఇవాళ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ లో వివిధ వర్గాల కోసం వేర్వేరు ప్రకటనలు చేశారు. మొత్తానికి ఆ ప్రకటనల ప్రభావం సామాన్యుడిపైనే పడనుంది.
What is NPS Vatsalya Scheme: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2024ను ప్రవేశపెడుతూ..చిన్నారులకోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఈ బడ్జెట్ లో పలు అంశాలను ప్రస్తావిస్తూ..ఎన్పీఎస్ వాత్సల్య పథకం గురించి వెల్లడించారు. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారం కోసం ఎన్పిఎస్-వాత్సల్య రూపంలో ఒక పథకం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో ఎలా పొదుపు చేయాలి?పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mudra Loan: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024 బడ్జెట్లో మహిళలకు అదిరిపోయే శుభవార్తను అందించింది. మహిళల ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేశారు. వారి స్వయం అభివృద్ధి కోసం అనేక కొత్త పథకాలను ప్రారంభించారు. ఈ పథకాలతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. బడ్జెట్లో ముద్రారుణ పరిమితిని రూ. 20లక్షలకు పెంచారు.
Union Budget 2024 Updates: నిర్మలమ్మ బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ఆశించిన ప్రయోజనం పెద్దగా లభించలేదు. ట్యాక్స్ స్లాబ్ మార్పులు, స్వల్పంగా స్టాండర్డ్ డిడక్షన్ పెంపు మినహాయ మరే ఇతర ప్రయోజనాలు చేకూరలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.