Prabhas Photos at Mogaltur: మొగల్తూరులో జనసందోహం.. కృష్ణంరాజు సంతాప సభ కోసం కదలివచ్చిన అభిమానులు-ఫోటోలు వైరల్

Prabhas Photos at Mogaltur: కృష్ణంరాజు సంతాప సభ మొగల్తూరులో ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి జన సందోహం వెల్లువెత్తింది. ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం. 

  • Sep 29, 2022, 17:56 PM IST
1 /5

ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఊరికి రావడంతో స్థానిక ప్రజలు ఆత్మీయంగా వారికి స్వాగతం పలికారు. ఇక కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఏపీ ప్రభుత్వం తరపున మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పరామర్శించారు

2 /5

రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మారక కార్యక్రమం కృష్ణంరాజు స్వస్థలమైన  మొగల్తూరులో భారీ ఎత్తున జరిగింది. ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మొగల్తూరు నివాసానికి వెళ్లారు. 

3 /5

ఈ క్రమంలో మంత్రి రోజా మాట్లాడుతూ రాజకీయాల్లో, సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న ఘనత కృష్ణం రాజు కే దక్కుతుందని అన్నారు. కృష్ణం రాజు గురించి ఏ ఒక్కరూ తక్కువగా మాట్లాడరని, కృష్ణం రాజు మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. 

4 /5

. కృష్ణం రాజు - వైఎస్ఆర్ కి మంచి అనుబంధం ఉందని, భౌతికంగా ఆయన దూరమైనా ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ది ఎవ్వరూ మరువలేరని రోజా అన్నారు. 

5 /5

కృష్ణం రాజు సినిమాల్లో రెబల్ స్టార్, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్న ఆమె కృష్ణం రాజు ఆశయాలకు తగ్గట్టు ప్రభాస్ సినీ రంగంలో మరింత పేరు తెచ్చుకోవాలన్నారు. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x