Use of firecrackers in Telangana: తెలంగాణలో టపాసుల విక్రయాలు, వినియోగంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

బాణసంచా విషయంలో హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీం కోర్టు.. రాష్ట్రంలో టపాసులపై ఆంక్షలు విధించే క్రమంలో ఎన్జీటీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

  • Nov 13, 2020, 17:50 PM IST

తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ రాష్ట్రంలో టపాసులు విక్రయాలు, వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడంపై ఫైర్‌క్రాకర్స్ డీలర్స్ అసోషియేషన్ సుప్రీం కోర్టులో​ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తెలంగాణలో టపాసులు విక్రయాలు, వినియోగంపై హై కోర్టు ఆదేశాలను సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది.

1 /7

బాణసంచా విషయంలో హైకోర్టు ఆదేశాలను సవరించిన సుప్రీం కోర్టు (Supreme court ).. రాష్ట్రంలో టపాసులపై ఆంక్షలు విధించే క్రమంలో ఎన్జీటీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. గాలినాణ్యత సూచీల ఆధారంగానే టపాసుల వినియోగంపై ఆంక్షలు వర్తిస్తాయని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.

2 /7

వాయు కాలుష్యం తీవ్రత అధిక స్థాయిలో ఉన్నచోట టపాసులపై పూర్తి నిషేధం ( Ban on firecrackers ) విధించాలన్న ధర్మాసనం.. గాలినాణ్యత సాధారణ స్థాయిలో ఉన్న ప్రాంతాల్లో 2 గంటలపాటు గ్రీన్ కాకర్స్ కాల్చేందుకు అనుమతిచ్చింది. 

3 /7

సాధారణ కాలుష్య ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గాలి కాలుష్యానికి దారితీయని గ్రీన్‌ క్రాకర్స్ ( Green crackers ) కాల్చుకోవచ్చు అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఫైర్‌వర్క్స్ డీలర్స్ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది.

4 /7

సాధారణ కాలుష్య ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గాలి కాలుష్యానికి దారితీయని గ్రీన్‌ క్రాకర్స్ ( Green crackers ) కాల్చుకోవచ్చు అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఫైర్‌వర్క్స్ డీలర్స్ అసోసియేషన్‌కు స్వల్ప ఊరట లభించింది.

5 /7

ఫైర్‌వర్క్స్​ డీలర్స్ అసోసియేషన్ పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణ నవంబర్ 16కు వాయిదా వేసింది. జస్టిస్ ఖాన్ విల్కర్ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.

6 /7

దీపావళితో పాటు రానున్న క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సైతం ఇవే ఆంక్షలు వర్తించనున్నట్టు సమాచారం. 

7 /7

దీపావళి పండగ నేపథ్యంలో పటాసులు విక్రయాలు, పటాసుల వినియోగంపై సుప్రీం కోర్టు తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.