మురుగదాస్ చిత్రానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

తమిళ సూపర్ స్టా్ర్ రజనీకాంత్ యంగ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో వరుసగా కబాలి, కాలా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. 

Last Updated : Sep 23, 2018, 05:24 PM IST
మురుగదాస్ చిత్రానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యంగ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో వరుసగా కబాలి, కాలా చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘పేటా’ సినిమాలో నటించడానికి కూడా సైన్ చేశారు. అయితే ఈ సినిమా దర్శకుడి పేరు ఇప్పటి వరకూ మీడియాలో లీక్ అవ్వలేదు. కాకపోతే.. పేటా చిత్రానికి దర్శకత్వం వహించేది మురుగదాస్ అని పలు వార్తలు ఆన్‌లైన్‌లో హల్చల్ చేస్తున్నాయి. సన్‌పిక్చర్స్‌ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ‘పేటా’ చిత్రానికి సంబంధించి ఇటీవలి కాలంలో చాలా చర్చ జరుగుతోంది. ఇదే రజనీకాంత్ నటించిన చివరి చిత్రమని.. ఈ చిత్రం తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల వైపు వెళ్లిపోతారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ‘పేటా’ చిత్రానికి దర్శకత్వం వహించేది మురుగదాస్ అవునా.. కాదా అన్న విషయంలో ఇంకా ఏ క్లారిటీ లేదు. మురుగదాస్‌ ప్రస్తుతం ‘సర్కార్‌’ సినిమా పనులు చూస్తున్నారు. విజయ్ ఈ సినిమాలో కథానాయకుడు. కీర్తి సురేశ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బహుశా ఈ సినిమా కంప్లీట్ అయ్యాకే మురుగదాస్ రజనీకాంత్ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. 

మరొక విషయం ఏమిటంటే.. దీపావళికి రజనీకాంత్ నటిస్తున్న మరో భారీ బడ్జెట్ ఎంటర్ టైనర్  ‘2.ఓ’ ప్రేక్షకులను అలరించనుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కూడా మరో ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రంపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x