Karnataka Elections 2023: కాంగ్రెస్ అభ్యర్థి భార్య కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం చేసి..

Karnataka Election Photos: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తున్నాయి. నాయకుల మాటల వేడి రోజురోజుకు పెరుగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. హోస్కోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శరత్ బచ్చెగౌడ భార్య ప్రతిభా శరత్ కారు అద్దాలను దుండగులు  పగులగొట్టడం కలకలం రేపుతోంది. 

1 /5

హోస్కోట్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బచ్చెగౌడ భార్య ప్రతిభా శరత్ నిత్యం ప్రచారంలో బిజీగా ఉన్నారు. తన భర్త గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.   

2 /5

హోస్కోట్ నగరంలోని పార్వతీపూర్‌లో ప్రతిభా శరత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా..  కారు అద్దాలు ధ్వంసం చేశారు.  

3 /5

ఆమె క్రిస్టా కారు సైడ్ గ్లాసులను పగలగొట్టారు. దుండగులను పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తిస్తున్నారు.  

4 /5

సంఘటనా స్థలాన్ని ఎన్నికల అధికారులు, హోస్కోట్ పోలీసులు పరిశీలించారు. అనుమానితులను విచారిస్తున్నారు.   

5 /5

కాంగ్రెస్ అభ్యర్థి శరత్ బచ్చెగౌడ భార్య ప్రతిభా శరత్ కారుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.