Rahul Gandhi: రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరునున్న పొంగులేటి..ఎప్పుడో తెలుసా?

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. జూలై 2 రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతున్నట్టు తెలిపారు. 

  • Zee Media Bureau
  • Jun 27, 2023, 03:35 PM IST

Ponguleti Srinivas Reddy: బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. జూలై 2 రాహుల్ గాంధీ సమక్షంలో చేరుతున్నట్టు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పార్టీకి చెందిన 35 మంది కీలక నేతలు కలిశారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక ఏ మార్గంలో వెళ్లాలనే అంశంపై అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నానని పొంగులేటి చెప్పారు. కొత్త పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అలా జరగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News