Telangana Cabinet Meet: మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. ఈ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరుగనుంది.
Revanth Reddy First Reaction On Jubilee Hills By Election: జూబ్లీహిల్స్లో విజయంపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగారు. ఈ సందర్భంగా విజయం సాధించడంపై రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ఇది సమష్టి విజయమని ప్రకటించారు. ఇక పాలనపై దృష్టి సారిస్తామని తెలిపారు.
Jubilee Hills by poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోలింగ్ వద్ద చివరి ఓటు పడేవరకూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రతి ఇంటి నుంచీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, తిరిగి ఇళ్లకు చేరేలా పర్యవేక్షణ బాధ్యతలను పోలింగ్ కేంద్రాల వారీగా పార్టీ నేతలకు అప్పగించింది.
KTR On Jubilee Hills Results: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తమకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా రెండేళ్లు కాకపోయినప్పటికీ.. అప్పుడే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్లో తాము 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిచామని.. ఈసారి అంతకంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
KTR Fire On Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓట్లు కావాలంటే అడుక్కోవాలి.. అంతేకానీ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడొద్దన్నారు. గెలవక ముందే ఆకురౌడీలు బెదిరిస్తున్నారని.. ఈ నేర చరిత్ర ఉన్నవారు పొరపాటున గెలిస్తే బతకనిస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న సీఎం మాట్లాడాల్సిన మాటలే కాదన్నారు కేటీఆర్. కుటుంబంలో చీలికలు పెట్టించి, ఆరోపణలు చేయించడం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు కేటీఆర్.
Any Risk We Will Finish SLBC Tunnel Says Revanth Reddy: ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను తాము తప్పక పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇది పూర్తి చేయకపోతే తమను క్షమించరని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది మరణించడం చాలా బాధకరమని పేర్కొన్నారు.
Private Colleges Close: తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యం నిరవధిక బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయాయి. వెంటనే ఈ బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్రైవేటు కాలేజీల జేఏసీ నిరవధిక బంద్ కు పిలుపు నిచ్చింది.
Katipally Venkataramana Reddy: కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అంటే.. రాజకీయాల్లో ముక్కుసూటితనం, నిజాయితీ, ధైర్యం కలగలిపిన వ్యక్తి. ఆయనతో మాట్లాడాలంటే గట్స్ ఉండాలి అంటారు. ఎందుకంటే ఆయన మాటల్లో ముసుగుండదు. ఏ విషయమైనా తూటాల్లాంటి పదాలతో నేరుగా ముఖం మీదే చెబుతుంటారు. ఆయన మాట్లాడే ప్రతిమాట ప్రత్యర్థుల గుండెల్లో గుచ్చుతుంటాయి. ఏం మాట్లాడితే.. ఎవరి మనసు దెబ్బతింటుందో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే తన సీటు కదులుతుందో అని ఆలోచించకుండా సత్యం అనిపించినదే మాట్లాడే ధైర్యం ఆయనకు ఉంది. అన్నా అంటే నేనున్నా అంటూ నియోజకవర్గ ప్రజలకు చేరువలో ఉంటారు. మంచి నాయకుడిగా..సక్సెస్ లీడర్ గా గుర్తింపు
Revanth Delhi Tour: నేడు సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. హైకమాండ్ నేతలతో కీలక అంశాలపై చర్చించనున్నారని సమాచారం. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో హస్తినకు పయమనమయ్యారు.
Jubilee Hills By Poll 2025: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుగా మారింది. ఈ ఉప ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అటు బీఆర్ఎస్ కూడా సానుభూతితో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు నేటితో ముగయనుంది.
Komatireddy Rajagopal reddy: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన కోమటిరెడ్డి అలియాస్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. పార్టీ కోసం తన ఆస్తులు అమ్ముకున్నా.. పార్టీలోని వ్యక్తులు మాత్రం తన చేతికి చిప్ప మిగిల్చారని ధ్వజమెత్తారు.
What Is Happened In Konda Surekha OSD And Deccan Cements Episode: తెలంగాణలో కొండా సురేఖ వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. డెక్కన్ సిమెంట్ వ్యవహారంలో ఓఎస్డీ సుమంత్ను బెదిరించారనే ఆరోపణలతో తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ వ్యవహారంలో ఏ జరిగింది? అనేది తెలుసుకుందాం.
Supreme on BC Reservations: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ల కల్పన అంశంపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణలో సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
Jubilee hills By Poll 2025: తెలంగాణలో రాజకీయాల్లో అధికార కాంగ్రెస్- ప్రధాన ప్రతిపక్షపార్టీ బీఆర్ఎస్ పరువు -ప్రతిష్టకోసం తాపత్రయ పడుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వచ్చిన జూబ్లీహిల్స్ బై పోల్...రెండు పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది.
BC Reservations on Supreme Court: బీసీ రిజర్వేషన్ల అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కీలక స్టెప్ వేయనుంది. జీవో నెంబర్ 9 అమలుకు నేడు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది.
Telangana Local body Elections:బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పోరాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించేయోచనలో ఉంది. దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Telangana Goverment going to fight on Supreme court: సీఎం రేవంత్రెడ్డి నేడు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేన్ల జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో దీనిపై తదుపరి కార్యాచరణ ఏమిటనే దానిపై అంతర్గతంగా చర్చించినట్టు తెలుస్తుంది.
Harish Rao On BC Reservations: బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లాగే, 42% బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఒక 'డ్రామా'గా అభివర్ణించారు.
Jubilee Hill By Poll Congress Candidate Naveen Yadav: బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఎలక్షన్ కమిషన్ బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అందులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఉంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ తరుపున పలువురు అభ్యర్ధులు పోటీ పడినా.. చివరకు యువకుడైన నవీన్ యాదవ్ ను ఎమ్మెల్యే అభ్యర్ధిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.