సీక్రెట్‌గా సాహో ఘూటింగ్..పైరసీ అరిట్టేందుకు చర్యలు

Last Updated : Nov 7, 2017, 07:50 PM IST
సీక్రెట్‌గా సాహో ఘూటింగ్..పైరసీ అరిట్టేందుకు చర్యలు

 సినిమా తీయాలంటే వందల కోట్లలో ఖర్చు చేయాలి... ఎన్నోరోజుల పాటు పదుల సంఖ్యలో శ్రమిస్తేకాని సినిమా పూర్తి కాదు.. అదికూడ  అభిమానులకు నచ్చినట్లు తీస్తేనే లాభాలు ...లేకుంటే నెత్తిమీద తడిగుడ్డ వేసుకోవడమే. అభిమానులకు నచ్చే రీతిలో తీసినా పైరసీ భూతం నుంచి తప్పించుకోవాలి ..లేదంటే కోట్లు నీళ్లలో వేసినట్లే. ప్రస్తుతం సినీ ఇండ్రస్ట్రీలో పైరసీ భూతం సంచరిస్తున్న విషయం తెలిసిందే. ఈ పైరసీ భూతం బాహుబలిలాంటి చిత్రాలను సైతం వదల్లేదు.. ఈ నేపథ్యంలో ప్రభాస్ హీరోగా తెరపైకి రానున్న సరికొత్త చిత్రం సాహోకు పైరసీ భూతం పట్టుకోకుండా ఉండేదుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మొన్నటివరకు ఈ సినిమాకు సంబంధించి చిన్నచిన్న షెడ్యూల్స్ మాత్రమే జరిగాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి లీకేజీలు లేవు. కానీ ఇకపై సాహో సినిమాకు సంబంధించి ప్రతిదీ కీలకమే. ఎందుకంటే ముఖ్యమైన దుబాయ్ షెడ్యూల్ ఉంది. ఆ తర్వాత మరో కీలకమైన షెడ్యూల్ కూడా ఉంది. అందుకే ఇకపై ఎలాంటి పిక్స్ లీక్ అవ్వకుండా ఉండేందుకు యూనిట్ కు చెందిన సభ్యుల సెల్ ఫోన్లను సెట్స్ పైకి అనుమతించకూడదని ఫిక్స్ అయింది యూనిట్. దాదాపు 150 కోట్ల రూపాయ బడ్జెట్ తో వస్తోంది సాహో సినిమా. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వస్తోంది.

Trending News