DA Hike: మీ జీతంలో పెరుగుదల ఏంటో తెలుసా? 24 గంటల్లోనే ప్రకటన!

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెంచే డీఏ పెంపుదలకు కేవలం 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అక్టోబర్ 10న ప్రకటించబోయే ఈ పెంపు, ఉద్యోగులకి ఆర్థికంగా చాలా మద్దతు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు.

1 /6

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఒక మంచి శుభ వార్తల వినే సమయం ఆసన్నం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దాంతో మోదీ ప్రభుత్వంలోని ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.   

2 /6

తాజా సమాచారం ప్రకారం, డీఏ (డియర్ నెస్ అల్లోవన్స్) 4 శాతం పెరగనుందని తెలుస్తోంది. 2024 మార్చిలో.. కేంద్రం ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ-డీఆర్ 4 శాతం పెంపు చేసింది ప్రభుత్వం. ప్రతి ఆరు నెలలకు డీఏ పెంపు జరుగుతుంది. ఒకటి జనవరి 1 నుండి అమల్లోకి వస్తుంది, మరొకటి జూలై 1 నుండి అమలవుతుంది. 

3 /6

రోజువారీ అవసరమైన వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయాల్లో, మార్కెట్ ధరల ఒత్తిడి కారణంగా డీఏ పెంపు జరగనుంది. ఉద్యోగుల డీఏ, రిటైర్డ్ ఉద్యోగుల డీఆర్ జీవనాధారంలో అత్యంత ముఖ్యమైన భాగమైన AICPI (ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్) సగటు మొత్తం ఆధారంగా నిర్ణయించబడుతుంది.   

4 /6

దీని ప్రకారం, డీఏ 3 శాతం పెరిగినట్లయితే.. ఒక ఉద్యోగి యొక్క కనీస ప్రాథమిక జీతం రూ. 18,000 గా ఉంటే, అది రూ. 9,000 నుండి రూ. 9,540 కు పెరుగుతుంది. అదే, డీఏ పెంపు 4 శాతం అయినట్లయితే, ఆ జీతం రూ. 9,720 వరకు చేరుతుంది.

5 /6

వచ్చే అక్టోబరులో, కేంద్రం నుండి డీఏ పెంపు ప్రకటన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు పండుగ సీజన్‌లో పెద్ద బొనాంజాలా మారవచ్చు. దీంతో, వచ్చే 48 గంటల్లోనే కేంద్ర ఉద్యోగులు డీఏ పెరుగుతుందనే ఆశలు పెట్టుకున్నారు. 

6 /6

అంతేకాకుండా, 8వ వేతన కమిషన్ (8th Pay Commission) చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ఈ చర్చల ఫలితంగా, డీఏ మరియు డీఆర్ పెంపు మరింత పెరగవచ్చు. దుర్గాపూజ వేళకి.. అంటే బుధవారం నాటికి, కేంద్ర ఉద్యోగులకు డీఏ పెంపు పెద్ద వార్తగా మారే అవకాశముంది.