7th Pay Commission: 5 రాష్ట్రాల ఉద్యోగులకు దీపావళి బహుమతి.. మీరు కూడా ఉన్నారా..?

DA Hike: ప్రతి సంవత్సరం దీపావళికి.. సాధారణంగా సెంట్రల్ గవర్నమెంట్.. ఉద్యోగులకు, పెన్షనర్లకు బహుమతి ప్రకటించే సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే చెయ్యనుంది ప్రభుత్వం. ముఖ్యంగా ఈసారి పెన్షనర్లకు.. డియర్ నెస్.. ఏకంగా మూడు శాతం పెంచుతుంది అని సమాచారం. 
 

1 /8

సాధారణంగా ప్రతి ఏడాది దీపావళికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వాలు దీపావళి బహుమతి ప్రకటిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కూడా దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు,  పెన్షనర్లకు డియర్ నెస్ అలవెన్స్ లో 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపింది.

2 /8

ఇంతకుముందు డియర్ నెస్ అలవెన్స్ 50% ఉండగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు శాతం పెంపుతూ జూలై 1 2024 నుండి అమలులోకి వచ్చే ఈ డి ఏ మరియు డిఆర్ లను కలిపి వారిని కూడా ఇందులో తీసివేయడం బేసిక్ పే లో 53% పెంచింది. 

3 /8

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,  పెన్షనర్లకు ప్రయోజనం కలగబోతోందని సమాచారం. 

4 /8

ఇదిలా ఉండగా ఐదు రాష్ట్రాలు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించగా.. పెరుగుతున్న ద్రవయోల్బనం మధ్య ఆర్థిక ఉపశమనంతో పాటు వారి మొత్తం పరిహారం ప్యాకేజీలను మెరుగుపరచడం జరిగింది. 

5 /8

ఇంక కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందు తాజా ఏడవ పే కమిషన్ అప్డేట్ లో జూలై 1 2024 నుండి అమలులోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్, అలాగే పెన్షనర్లకు డియర్ నెస్ రిలీఫ్ మూడు శాతం పెంచుతూ.. ప్రకటించిన ఈ డిఏ పెంపుతో ఉద్యోగులు పెన్షనర్లు దీపావళికి ముందు మూడు నెలల జీతంతో పాటు బకాయిలు కూడా అందుకో బోతున్నారు.

6 /8

రివైజ్డ్ స్కేల్ ఆఫ్ పే, 2017 ఆధారంగా జీతాలు పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులకు ఈ డియర్ నెస్ అలవెన్స్ లో నాలుగు శాతం పెంపుదలను ఒడిస్సా ప్రభుత్వం ఆమోదించింది. గతంలో డిఎ 46 శాతం ఉండగా , ఇప్పుడు 50% పెంచుతూ జనవరి 1 2024 నుండి అమలులోకి తెచ్చింది. 

7 /8

అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కూడా డియర్ నెస్ అలవెన్స్ లో 4శాతం పెరుగుదల ప్రకటించారు.  ఇది జనవరి 1 2023 నుండి అమలులోకి వస్తుంది.  అదనంగా ప్రభుత్వ ఉద్యోగుల వైద్య బిల్లులు , పెన్షన్ 75 యేళ్లు నిండిన వారికి బకాయిలు వెంటనే చెల్లిస్తామని కూడా తెలిపారు. 

8 /8

అలాగే జార్ఖండ్లో 9% , ఛత్తీస్గఢ్లో 4 శాతం , సిక్కిం లో 4 శాతం అలవెన్స్ పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా జనవరి 1 2024 నుండి అమలులోకి వచ్చాయి.