Sridevi: రాఖీ కట్టిన అన్నయ్యనే పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. ఇంత కథ నడించిందా..?

Sridevi Marriage story : శ్రీదేవి బోనీకపూర్ ను అన్నయ్య అని సంబోధిస్తూనే.. అతనితో ప్రేమలో పడి జాన్వికపూర్ బిడ్డనిచ్చిన తరువాత అతడిని వివాహం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది మొత్తానికైతే అన్నయ్య అంటూనే అతడికి దగ్గరయి అతడిని వివాహం చేసుకుంది.

1 /7

అతిలోక సుందరి అందాలతార గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.  1969లో  తమిళ సినిమా తునైవన్ అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగేళ్ల వయసులో ఇండస్ట్రీకి పరిచయమైంది. 

2 /7

తన అద్భుతమైన నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. 1971లో ఉత్తమ బాలనటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా దక్కించుకుంది. 1975లో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె అక్కడ కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

3 /7

ఇకపోతే హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీదేవి.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ ను మొదలుకొని ఎంతోమంది హీరోలతో కలిసి నటించింది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి, అతిలోకసుందరి అందాల తారగా పేరు సొంతం చేసుకుంది. 

4 /7

ఇదిలా ఉండగా దుబాయ్ కి ఒక పెళ్లికి వెళ్లిన ఈమె అనూహ్యంగా అక్కడ బాత్ టబ్ లో పడి మరణించింది. తన అంద చందాలతో నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె అనూహ్యంగా మరణించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.   

5 /7

ఇదిలా ఉండగా రాఖీ కట్టిన అన్నయ్య బోనీ కపూర్ తోనే ఏడడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఎందుకు ఇలా చేసింది అనే విషయం ఇప్పుడు చూద్దాం. తమిళ సినిమాలో శ్రీదేవి పనిచేసేటప్పుడు ఆమెను చూసి ఆమె ప్రేమలో పడిపోయాడు బోనీకపూర్. ఆమెతో మిస్టర్ ఇండియా సినిమాలో ఒక పాత్ర కోసం సంప్రదించాడు.  అయితే ఆ సమయంలో ఆయన వివాహం చేసుకోలేదు.  శ్రీదేవి మాత్రం మిథున్ చక్రవర్తితో డేటింగ్ లో ఉంది. అంతేకాదు ఆ సినిమా సమయంలో మిథున్ ఆమెను రహస్యంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు కూడా వినిపించాయి. 

6 /7

శ్రీదేవి తనను బహిరంగంగా అంగీకరించాలని కోరుకుందని,  అయితే తన భార్యను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదని, చివరికి పుకార్లను కొట్టి వేసి సంబంధాన్ని ముగించాడని కూడా వార్తలు వినిపించాయి. ఇంతలోనే బోనీ - మోనా తో వివాహానికి సిద్ధమయ్యారు. అంతేకాదు అర్జున్ , అన్షులా కపూర్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 13 ఏళ్లపాటు వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ఏడేళ్లకు శ్రీదేవికి మోనా కపూర్ తో స్నేహం చేస్తూ.. బోనీ కపూర్ కి  దగ్గర అయింది. అలా బోనీ కపూర్ ను అన్నయ్య అంటూ సంబోధించేది.  అంతేకాదు అదే సమయంలో బోనీకపూర్ కు రాఖీ కూడా కట్టింది.

7 /7

అయితే ఒకానొక సమయంలో శ్రీదేవి తల్లి చేసిన అప్పులను బోనీకపూర్ మాఫీ చేయడంతో శ్రీదేవి మరోసారి దగ్గర అయింది. అలా ఒకరికొకరు దగ్గరైనా.. వీరి వివాహం చేసుకోకుండానే శ్రీదేవి గర్భవతి అయింది. ఈ విషయం మోనాకు నచ్చలేదు. దీంతో బోనీకపూర్ నుంచి విడిపోయింది. అలా అన్నయ్య అని సంబోధించిన  ఆ తర్వాత అతడితోనే డేటింగ్ చేసి బిడ్డకు జన్మనివ్వడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. అలా పెళ్లికి ముందే వీరికి జాన్వీ కపూర్ జన్మించింది.  ఇక ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఖుషి కపూర్ కి  జన్మనిచ్చారు.