Bharath Bandh 2024: రేపు భారత్‌ బంద్‌.. దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్నింటికీ సెలవు ఉంటుందా..?

Bharath Bandh On august 21st: రిజర్వేషన్‌ బచావో సంఘర్ష్‌ సమితి రేపు ఆగష్టు 21 బుధవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఆ సంఘం ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. భారత్‌బ బంద్‌లో భాగంగా రేపు దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు అన్నింటికీ సెలవు ఉంటుందా? ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ఎస్సీ ఎస్టీ గ్రూపుల్లో సబ్‌ కేటగిరీలు అర్హులైనవారికి  రిజర్వేషన్‌ కల్పించాలని సుప్రీం కోర్టు ఆగష్టు 1న తీర్పునిచ్చింది. దీనికి సంబంధించిన అంతిమ నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే తుదినిర్ణయం అని తీర్పునిచ్చింది. అయితే, దీన్ని వ్యతిరేకించిన బచావో సంఘర్ష్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.  

2 /5

 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో విబేధాలు సృష్టించడానికి వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. అయితే, ఈ భారత్‌ బంద్‌కు వివిధ సామాజిక, రాజకీయ సంస్థల నుంచి మద్ధతు లభిస్తుందని భావిస్తున్నారు.  

3 /5

అయితే, రేపు ఆగష్టు 21న జరిగే భారత్‌ బంద్‌కు స్కూళ్లు, కాలేజీకు సెలవు ఉందా? లేదా? అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. నేడు భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని విద్యసంస్థలకు సెలవు ప్రకటించాయి. ఈ సందర్భంగా రేపు కూడా విద్య సంస్థలు బంద్‌ ఉంటాయా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.  

4 /5

ఈ విషయంపై రేపు ఉదయం వరకు వేచి ఉండాల్సిందే. మరోవైపు బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని, తమకు ఇంకా ఎటువంటి అధికారిక స్పష్టత రాలేదని బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. ఈ బంద్‌ దృష్ట్యా పోలీసుకు ఉన్నతాధికారులు సమావేశమై ఈ బంద్‌కు సిద్ధం కావాలని ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  సీనియర్‌ సివిల్‌, పోలీస్‌ అధికారుల సమావేశం జరిగింది.  

5 /5

అంతేకాదు రేపు ఆగష్టు 21న దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల పరిస్థితులపై కూడా ఇంకా క్లారిటీ రాలేదు. మొత్తానికి ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రేపు జరగనున్న భారత్‌కు బంద్‌కు ఆర్టీసీ, రైల్వే శాఖల నుంచి కూడా అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు