Delhi Red Fort: ఢిల్లీ ఎర్రకోట అసలు రంగు ఇది కాదా, రంగు ఎవరు, ఎందుకు మార్చారు

Delhi Red Fort: దేశ రాజధాని ఢిల్లీ గురించి ప్రస్తావిస్తే తప్పకుండా గుర్తొచ్చేది ఎర్రకోట లేదా రెడ్ ఫోర్ట్. అసలీ కోటను ఎర్రరంగులో ఎందుకు నిర్మంచారనేది పరిశీలిస్తే అసలు వాస్తవం తెలుస్తుంది. ఎర్రకోటకు ఇప్పుడున్న ఎర్రరంగు అసలు రంగు కాదట. ఆ రంగు ఇచ్చింది ఆంగ్లేయులు. 

Delhi Red Fort: దేశ రాజధాని ఢిల్లీ పేరు వినగానే గుర్తొచ్చే ఎర్రకోట ఠీవి, రాజసం మరి దేనికీ సాటి రావు. దుర్బేధ్యమైన కోటగా అప్పట్లో పేరున్న ఈ కోట ఇప్పటికీ దేశ స్వాతంత్ర్య వేడుకలకు వేదికగా ఉంటోంది. ఎర్రరంగులో రాజసం ప్రదర్శిస్తున్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ గురించి పూర్తి వివరాలు మీ కోసం..

1 /5

ఎర్రకోటను కిలా ఎ ముబారక్ అని కూడా పిలుస్తారు. మొగల్ చక్రవర్తుల కాలంలో ముబారక్ కోటగా కూడా పిలిచేవారు. మొగల్ చక్రవర్తి షాజహాన్ తన తాత అక్బర్‌కు గుర్తుగా ఆగ్రా రెడ్ ఫోర్ట్  స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ ఎర్రకోటను నిర్మించాడు.

2 /5

ఢిల్లీ ఎర్రకోటను సున్నపురాయితో నిర్మించారు. దీని రంగు తెలుపు. కానీ వాతావరణం కారణంగా పాడవుతుండటంతో ఆంగ్లేయులు తెలుపురంగు నుంచి ఎర్రరంగుకు మార్చారు. 

3 /5

1858 సిపాయిల తిరుగుబాటు తరువాత ఆంగ్లేయులు ఆక్రమించారు ఈ కోటను. ఇండియాకు స్వాతంత్ర్యం లభించిన తరువాత ఈ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేయడం ప్రారంభించారు. 2007లో యునెస్కో ఈ కోటను ప్రపంచ హెరిటేజ్ సంపదగా గుర్తించింది.

4 /5

యమునా నది ఒడ్డున నిర్మితమైంది ఢిల్లీ ఎర్రకోట. షాజహాన్ కంటే ముందు మొఘల్ చక్రవర్తులు ఆగ్రా రాజధానిగా పాలించేవారు. కానీ షాజహాన్ రాజధానిని ఆగ్రా నంచి ఢిల్లీకు మార్చాడు.

5 /5

ఢిల్లీ ఎర్రకోట ఎన్నో చారిత్రాత్మక ఘటనలకు వేదిక, నిలువెత్తు సాక్ష్యం. ఈ కోటకు రక్తం చిందించిన చరిత్ర ఉంది. ఫరూఖ్ షియర్ నుంచి బహదూర్ షాహ్ జాఫర్ పాలన వరకూ చాలా ఘటనలకు కేంద్రంగా నిలిచింది.