Devara Part 2 story: దేవర రెండో భాగం కథ ఇదే.. ఆ సీన్ లో పెద్ద క్లూ.. ఇంతకీ ఎథి ఎవరంటే!

Devara part 2 story leaked: సెప్టెంబర్ 27న విడుదలైన దేవర సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జనతా గ్యారేజ్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం.. మొదటి రోజే వంద కోట్లు దాటి అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో రెండు భాగాలుగా రానున్న ఈ చిత్ర రెండో భాగం కథ ప్రస్తుతం తెగ వినిపిస్తోంది.

1 /7

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే బాహుబలి, పుష్ప, సలార్, కల్కి లాంటి సినిమాలు ఇలా రెండు భాగాలకు కాన్సెప్ట్ తో వచ్చి అందరిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే దానిని ఫాలో అయ్యింది జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం షూటింగ్ మొదలైన దగ్గర నుంచే ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి తెచ్చిపెట్టింది. 

2 /7

ఇక సెప్టెంబర్ 27న విడుదలైన.. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదట్లో ఈ సినిమాకి కొంచెం మిక్స్ రెస్పాన్స్ వచ్చినా కానీ.. షోలు గడిచే కొద్దీ.. సినిమా చాలా బాగుంది అంతు టాక్ బయటకు వస్తోంది. 

3 /7

ఈ క్రమంలో ఈ చిత్ర రెండో భాగం కథ గురించి కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ చిత్రం పోలీస్ ఆఫీసర్లు యటి కోసం వెతుకుతూ ఎర్ర సముద్రంకి వచ్చినప్పుడు మొదలవుతుంది.. అయితే ఆ యటి ఎవరు అనేది చివరి వరకు కూడా చూపించరు. ఇక చివరిలో క్లైమాక్స్ లో కూడా దేవరాని చంపింది.. అతని కొడుకు వరానే.. అని ప్రకాష్ రాజ్ చెపుతారు. అక్కడితో సినిమా ముగిస్తుంది. 

4 /7

ఈ చిత్రంలో చివరి సీన్ బాగా గమనిస్తే.. దేవరని చంపేసేది ఇంట్రవెల్ సీన్ దగ్గరే అని అర్థమవుతుంది. అంటే మొదటి భాగంలోనే దేవర చనిపోయారు. మరింక.. రెండో భాగంలో కథ ఏమిటి ఉంటుంది అనే విషయం గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. 

5 /7

అయితే వర.. కొద్ది రోజుల తర్వాత అక్కడ కాంట్రాక్టులు ఇచ్చే మురుగని చంపేస్తారని.. ఆ ప్లేస్ లో మురుగన్ తరుపున ఎథి వస్తారని.. అయితే చాలా స్ట్రాంగ్ విధంగా రెండో భాగంలో చూపించనున్నారు అని సమాచారం. ఇక ఎథిని అతని మనుషులను చంపే.. వర సముద్రం కింద పూడుస్తారని. వీళ్ళనే అజయ్ సముద్రంలో మొదటి సీన్లో చూసేది అని కొంతమంది తమ సొంత కథ కూడా సోషల్ మీడియాలో రాసేశారు. 

6 /7

ఇక ఇంట్రవెల్ ముందు జూనియర్ ఎన్టీఆర్ ఒకరిని చంపపోయి వదిలేస్తారు.. అతను బైరా తమ్ముడని.. తను చెల్లెలుగా భావించే అమ్మాయిని చేసుకోవడం వల్లే అతని దేవర వదిలేసారని.. కానీ ఆ అమ్మాయి కూడా తర్వాత చనిపోతుందని.. ఎందుకంటే.. ప్రస్తుతం కథ జరిగేటప్పుడు జాన్వి కపూర్ మేనత్తని చూపిలేదు కాబట్టి.. అమ్మాయి చుట్టూ కూడా ఏదో కథ ఉందని చర్చలు సాగుతున్నాయి.

7 /7

అంతేకాదు తన వల్లే సముద్రం ఎర్రగా మారింది అని గమనించిన దేవర.. తన ఊరిని మార్చడానికి.. వరకి మార్గం చెప్పి అతను చేతిలోనే చనిపోతారని కూడా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథలు రాస్తున్నారు. మరి ఈ కథలో నిజంగా తెలియాలి అంటే దేవర రెండో భాగం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x