Devotee Cuts Tongue: నవ రాత్రుల్లో నాలుక కోసుకున్న భక్తుడు.. అమ్మవారి పాదాల వద్ద పెట్టి..

Devotee Cuts His Tongue: నవరాత్రుల సమయంలో దుర్గమాత 9 అవతారాలను పూజిస్తాం. అమ్మవారికి ఇష్టమైన నేవేద్యం సమర్పించి, ధూపదీపాలు పెడతారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని రత్నఘర్ ఆలయంలో ఓ భక్తుడు అమ్మవారికి ఏకంగా తన నాలుకను కట్ చేసి సమర్పించాడు.
 

1 /5

Devotee Cuts His Tongue: నవరాత్రుల్లో అమ్మవారిని భక్తశ్రద్ధలతో పూజిస్తాం. దుర్గామాత తొమ్మిది రూపాలను 9 రోజులపాటు పూజలు చేస్తారు. ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో ఈ పూజలు చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్‌ 3న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.   

2 /5

మన దేశ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఓ భక్తుడు అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చూసి స్థానికులు షాకింగ్‌కు గురవుతున్నారు. అవును,రామ్‌ శరణ్‌ అనే భక్తుడు తన నాలుకను కట్‌ చేసి అమ్మవారికి సమర్పించాడని ఆలయ పూజారి జై కిషన్‌ చెప్పారు.  

3 /5

ఈ భక్తుడు అమ్మవారికి దాదాపు మూడు అంగుళాలు తన నాలుకను కట్‌ చేసి సమర్పించాడని చెబుతున్నారు. అమ్మవారి వద్ద ఉన్న ఓ కుండలో రక్తాన్ని కూడా కొంతమేర నింపాడు. ఈ ఘటన గురించి తెలిసిన చుట్టుపక్కవారు అక్కడికి చేరుకుంటున్నారు. రత్నగిరి అమ్మవారు అంటే మాకు ఎంతో నమ్మకం ఉందని అందుకే సదరు భక్తుడు తన నాలుకను సమర్పించాడని చెబుతున్నారు.  

4 /5

కాగా, ఈ రత్నఘర్ ఆలయం 2015లో నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలోని వెలసిన దుర్గామాతపై తమకు ఎంతగానో నమ్మకం ఉందని భక్తులు చెబుతున్నారు. అమ్మ ఎంతో దయగలదని అంటున్నారు.లాహర్‌ నగర్‌లో ఉన్న ఈ ఆలయంలో చాలా మంది అమ్మవారిని దర్శించుకుంటారు. అంతేకాదు ఆ భక్తుడికి మళ్లీ తిరిగి నాలుక వస్తందనే నమ్మకం మాకు ఉందని ఆలయానికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.  

5 /5

ఆలయంలో నిన్న హవనం కూడా నిర్వహించిన భక్తుడు అమ్మవారికి భక్తితో తన నాలుకను కోసి సమర్పించాడు. ఇలాంటి ఘటనలు గతంతో కూడా కోకొల్లలు. అమ్మవారిపై ఉన్న భక్తిని చాటుకోవడానికి మరికొందరు, కోరికలు నెరవేరినప్పుడు ఇలా చేస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)