Balakrishna: ఇండస్ట్రీలో బోలెడు స్టార్ కిడ్స్.. కానీ బాలయ్య కూతుళ్ళకే ఎందుకంత క్రేజ్..!

Tollywood hero daughters: సీనియర్ హీరోల్లో నాగార్జునకు తప్ప మిగతా అందరికీ కూడా కూతుర్లు.. ఉన్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ కూతుర్లల్లో నిహారిక సినిమాల్లో సైతం నటించింది. మరోపక్క మొదటి కూతురు చిరంజీవి సినిమాలు చూసుకుంటూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే వీళ్ళు ఎవరికీ లేని క్రేజ్.. బాలయ్య కూతుర్లకు మాత్రం సొంతమవుతుంది. బాలకృష్ణ కూతుళ్లు ఇద్దరూ కూడా మీడియా ముందుకి రావాలని ఎప్పుడూ అనుకోరు.. కానీ వస్తే మాత్రం.. హీరోయిన్స్ కన్నా ఎక్కువ వీరికి ప్రాధాన్యత ఉంటోంది..
 

1 /5

సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు. అయితే అందులో కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా, హీరోయిన్ గా చలామణి అయితే.. మరి కొంతమంది తెర ముందుకు రాకపోయినా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కిడ్స్ ఉన్నప్పటికీ బాలయ్య కూతుర్లకు మాత్రం చాలా క్రేజ్ అనే చెప్పాలి. వీరు ఎప్పుడూ కూడా మీడియా ముందు కనిపించరు. కానీ వీరికి మాత్రం ప్రత్యేకమైన అభిమాన సంఘం కూడా ఉంది.

2 /5

ప్రత్యేకించి బాలయ్య కూతుర్లకే ఎందుకంత ప్రత్యేకత అనే విషయం ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళితే.. తాజాగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్ నిర్వహించగా ..ఈవెంట్లో బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా పాల్గొని, మొదటిసారి మీడియా ముందుకు వచ్చి చాలా చక్కగా మాట్లాడుతూ అందరిలో అటెన్షన్ క్రియేట్ చేసింది. 

3 /5

తేజస్విని మాట్లాడుతూ.. ఈరోజు నాకు చాలా స్పెషల్.  ఎందుకంటే మొదటిసారి మీ ముందు నిలుచున్నాను.  అరవింద్  అంకుల్ కి ఈ ఆలోచన వచ్చినప్పుడు అందరూ ఆలోచించారు.  అసలు ఈ షో చేద్దామా వద్దా అని.. అయితే నాన్న మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా చేయాల్సిందే అని చెప్పారు. నాన్న ధైర్యం చేసి చెప్పడం వల్ల ఈరోజు అన్ స్టాపబుల్ ఈ స్టేజ్ కి వచ్చింది. 

4 /5

ఐఎండిబి రేటింగ్స్ లో అన్ స్టాపబుల్ షో ప్రపంచంలో 18వ ర్యాంకు సాధించగా.. ఇండియాలో మోస్ట్ పాపులర్ షోగా నిలిచింది . ఇందులో యూనిక్ పాయింట్ ఏంటంటే నాన్నలో ఎవరు చూడని యాంగిల్ ను అందరూ చూశారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ అంటే చాలెంజ్ వచ్చినప్పుడు ధైర్యంగా తీసుకోవాలి. పక్కన ఎవరుంటే వాళ్ల కోసం నిలబడాలి. ఇక సమాజం కోసం ముందడుగు వేయాలి. ఇవన్నీ నాన్న లో ఉన్నాయి.  ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ, ఫ్రెండ్స్,  ప్రజల కోసం నిలబడే వ్యక్తి. క్యాన్సర్ హాస్పిటల్ లో ఉండే పేషెంట్స్ కి అది దేవాలయం. త్వరలో  మాత్రమే కచ్చితంగా నాన్నలోని ఇంకో యాంగిల్ ని చూస్తారు అంటూ తేజస్విని మాట్లాడింది. 

5 /5

ఇకపోతే మీడియా ముందుకు మొదటిసారి వచ్చినా అద్భుతమైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంది తేజస్విని.  అందుకే ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఉన్నా.. వీరు మాత్రం తెర ముందుకు రాకపోయినా అందరిలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారని చెప్పవచ్చు.