Pm modi 3.0: ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారు.. కీలకంగా మారిన ఆ సమావేశం.. ఎందుకో తెలుసా..?

Narendra modi: మోదీ మూడోసారి ఢిల్లీలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా మంత్రులకు మోదీ శాఖలను కూడా కేటాయించారు.

1 /8

దేశంలో ప్రస్తుతం మోదీ3.0 హవా  కొనసాగుతుంది. మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా.. రైతులకోసం కిసాన్ సమ్మాన్ నిధుల ఫైల్ మీద తొలిసంతకం చేశారు. ఇక రేపు జూన్ 12 (బుధవారం) ఏపీలో జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకరానికి హజరుకానున్నారు. 

2 /8

మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక.. ఆయన విదేశీపర్యటనపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే.. ప్రధాని మోదీ మూడోసారి తొలిసారిగా విదేశీ పర్యటనలో భాగంగా జీ7 సదస్సు కోసం ఈ వారం ఇటలీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

3 /8

ప్రధాని మోదీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్‌లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

4 /8

మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో G7 అధునాతన ఆర్థిక వ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఈ వారం ఇటలీకి వెళ్లనున్నారు. జూన్ 13 నుండి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా లోని రిసార్ట్‌లో జరగనున్న G7 సమ్మిట్ జరగనుంది.

5 /8

మెయిన్ గా ఈ సదస్సులో..  ఉక్రెయిన్‌లో మారణకాండ, గాజాలో సంఘర్షణ వంటి అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సమ్మిట్ కు.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ కౌంటర్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరు కానున్నట్లు తెలుస్తోంది.  

6 /8

అదే విధంగా.. ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ కూడా తమ దేశంపై రష్యా దాడికి సంబంధించి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. కాగా మోదీ..  జూన్ 13న ఇటలీకి బయలుదేరి జూన్ 14న వెంటనే తిరిగి భారత్ కు వస్తారని సమాచారం. 

7 /8

ఇదిలా ఉండగా..  గతేడాది మేలో హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సుకు మోదీ హాజరయ్యారు. సమ్మిట్ సందర్భంగా, జెలెన్స్కీ,  ఇతర నాయకులతో రష్య యుద్ధంపై చర్చలు జరిపాడు. 

8 /8

G7లో US, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా మరియు జపాన్ ఉన్నాయి. ఇటలీ G7 (గ్రూప్ ఆఫ్ సెవెన్) యొక్క ప్రస్తుత అధ్యక్ష పదవిని కలిగి ఉంది. ఈ క్రమంలో అదే హోదాలో సమ్మిట్‌ను నిర్వహిస్తోంది.