Pm modi: 45 గంటల పాటు ధ్యానంలో మోదీ.. ఆయన తీసుకునే ఆహరం ఏంటంటే..?

PM modi meditation: దేశ ప్రధాని మోదీ చివరి దశ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని కన్యాకుమారీ చేరుకున్నారు. అక్కడ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ధ్యానంలో నిమగ్నమయ్యారు.

1 /8

నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం ముగియగానే తమిళనాడులోని వివేకానంద  శిలాస్మారకం వద్దకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఆయన మెడిటేషన్ లో నిమగ్నమయ్యారు. స్వామి వివేకానంద కూడా గతంలో ఇక్కడ మూడు రోజుల పాటు మెడిటేషన్ చేశారని చెప్తుంటారు.   

2 /8

మోదీ ధ్యానం సమయంలో ఎలాంటి ఆహారం తీసుకుంటారో అని ఆయన అభిమానులు  ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. మోదీ 45 గంటల పాటు ధ్యానం చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో విరామం ఇస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.   

3 /8

విరామం సమయంలో కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షారసం మాత్రమే తీసుకుంటారని సమాచారం. అదే విధంగా ఆయన ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్ గా మౌనంతో ఉంటారని కూడా తెలుస్తోంది.  

4 /8

ప్రస్తుతం కాషాయ దుస్తుల్లో ఉన్న మోదీ చిత్రాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచాయి. మోదీ సూర్య నమస్కారాలు చేసి, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి తన మెడిటేషన్ ను ప్రారంభించారు. 

5 /8

చివరి దశ ఎన్నికలకు ముందు మోదీ మెడిటేషన్ లో కూర్చున్నారు. జూన్ 1 సాయంత్రం వరకు కూడా ఆయన ధ్యానమండపంలోనే ఉంటారని తెలుస్తోంది. ఇక్కడ 1892 లో స్వామి వివేకానంద కూడా ధ్యానం చేసిన ప్రదేశం కూడా ఇదే. 

6 /8

అంతకు ముందు మోదీ భగవతి అమ్మన్ ఆలయంకు వెళ్లారు. అక్కడ సాంప్రదాయ దుస్తులలో మోదీ అమ్మవారిని దర్శించుకున్నారు. 108 శక్తిపీఠాలలో భగవతి అమ్మాన్ ఆలయం కూడా ఒకటని చెబుతుంటారు.

7 /8

అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మోదీ.. స్పెషల్ బోటులో వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపానికి చేరుకున్నారు. ధ్యానమండపంలో స్వామి వివేకనంద, భగవాన్ రామకృష్ణ పరమహంస విగ్రహాల ఎదుట ప్రార్థనలు చేశారు. 

8 /8

ప్రధాని మోదీ బసచేసిన వివేకానంద శిలా స్మారకం కన్యాకుమారీ నుంచి 500 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడికి మనం వసతురాయ్ బీచ్ నుంచి చేరుకోవచ్చు.ఈ ప్రదేశంలో బంగాళా ఖాతం, అరేబియా సముద్రం, హిందు మహా సముద్రంలు ఒకే చోట కలుస్తాయి.