RRR Team: గ్రీన్ ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్, మొక్కలు నాటిన రాజమౌళి, రామ్‌చరణ్, తారక్

తెలంగాణ అధికార పార్టీ, టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్ పాల్గొంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్ నిమిత్తం తిరుగుతున్న ఆర్ఆర్ఆర్ బృందం హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైంది. ఇది తమ మనస్సుకు చేరువైన కార్యక్రమమని జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రామ్‌‌చరణ్‌లు వ్యాఖ్యానించారు. పలు మొక్కలు నాటారు.
  • Mar 24, 2022, 16:46 PM IST

RRR Team: తెలంగాణ అధికార పార్టీ, టీఆర్ఎస్ నేత, ఎంపీ సంతోష్ కుమార్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్ పాల్గొంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్ నిమిత్తం తిరుగుతున్న ఆర్ఆర్ఆర్ బృందం హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైంది. ఇది తమ మనస్సుకు చేరువైన కార్యక్రమమని జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, రామ్‌‌చరణ్‌లు వ్యాఖ్యానించారు. పలు మొక్కలు నాటారు.

1 /6

తాను గతంలో కూడా గ్రీన్ ఛాలెంజ్ చేశానని, మొక్కలు నాటిన ప్రతీసారి తెలియని ఉత్సాహం వస్తుందని ఆర్ఆర్ఆర్ మరో హీరో రామ్‌చరణ్ చెప్పారు.

2 /6

ఈ భూమిపై మనం అందరమూ అతిథులం మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలని, మన ఇంటి పిల్లలను ఎలా పెంచుతామో మొక్కలనూ అలాగే నాటి రక్షించాలని చెప్పారు  

3 /6

దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్  మరింత విజయవంతంగా కొనసాగాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి, ప్రతీ ఒక్కరూ ప్రకృతి రక్షణ కోసం చైతన్యవంతంగా ఉండాలని  అన్నారు.

4 /6

ప్రకృతి, పర్యావరణం తమ మనసుకు నచ్చిన కార్యక్రమాలని, వీలున్నప్పుడల్లా పచ్చదనం పెంపు కోసం మొక్కలు నాటి, పరిరక్షిస్తున్నామని డైరెక్టర్ రాజమౌళి తెలిపారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంతోష్ సంకల్పం చాలా గొప్పదని, మరింత విజయవంతం కావాలన్నారు.

5 /6

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్,  రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. 

6 /6

ఈ నెల 25న దేశ, విదేశాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆర్ఆర్ఆర్ సినిమా. (రౌద్రం - రణం- రుధిరం). ఈ సినిమా రిలీజ్ ప్రచారంలో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న చిత్ర బృందం ఇవాళ హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగమైంది.