Amaran: అమరన్ కోసం సాయి పల్లవి కన్నా.. పది రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న శివ కార్తికేయన్

Sai Pallavi: సాయి పల్లవి కి సౌత్ ఇండియాలో ఉండే క్రేజ్..గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో నిజంగానే ఫిదా చేసింది ఈ హీరోయిన్. ఇక అప్పటినుంచి తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు వరస అవకాశాలు రావడం మొదలయ్యాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా.. సాయి పల్లవికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 

1 /5

మలయాళం లో వచ్చిన ప్రేమమ్ సినిమాతో సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రంలో టీచర్ గా కనిపించి అందరిని తెగ ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే ఈమెకు అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 

2 /5

సాయి పల్లవి కెరియర్ లో ఫిదా సినిమాకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంతోనే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్. మరోసారి శేఖర్ కమ్ములతో సాయిపల్లవి తీసిన లవ్ స్టోరీ కూడా ఆమెకు మంచి విజయం అందించింది. 

3 /5

మరోపక్క తమిళంలో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. ఒక రకంగా చెప్పాలి అంటే స్టార్ హీరోలకి ఎంతటి క్రేజ్ ఉంటుందో.. సాయి పల్లవికి కూడా అంతే క్రేజ్ ఉందని రుజువు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులైతే ఈమెను ఏకంగా.. లేడి పవర్ స్టార్ అంటారు. 

4 /5

ఈ క్రమంలో ఈ మధ్య సాయి పల్లవి హీరోయిన్ గా చేసిన చిత్రం అమరన్.. తమిళంతో పాటు తెలుగులో కూడా.. మంచి ఓపెనింగ్ సాధించింది. మేజర్ ముకుందన్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రంలో.. సాయి పల్లవి కి జోడిగా శివ కార్తికేయన్ నటించాడు. 

5 /5

ఇక ఈ మధ్య వరకు.. ఈ సినిమాకి సాయి పల్లవి ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరో వార్త కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అదేమిటంటే సాయి పల్లవి ఈ చిత్రం కోసం మూడు కోట్లు తీసుకోగా.. శివ కార్తికేయన్ ఏకంగా 30 కోట్లు తీసుకున్నారట. అంటే సాయి పల్లవి కన్నా 10 రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ హీరోకి దక్కినట్లు సమాచారం.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x